ఈల వేసి ఆంధ్రను అలరించిన రఘురామయ్య

కళ్యాణం వెంకట సుబ్బయ్య ఈల వేస్తే శ్రోతలు…ప్రేక్షకులు తన్మయత్వం చెందేవారు. ఒక చేత్తో వేణువును పట్టుకుని, నోట్లో వేలు పెట్టుకుని రాగయుక్తంగా ఈల పాట, పద్యాలు పాడితే…

 ఈల వేసి ఆంధ్రను అలరించిన రఘురామయ్య

కళ్యాణం వెంకట సుబ్బయ్య ఈల వేస్తే శ్రోతలు…ప్రేక్షకులు తన్మయత్వం చెందేవారు. ఒక చేత్తో వేణువును పట్టుకుని, నోట్లో వేలు పెట్టుకుని రాగయుక్తంగా ఈల పాట, పద్యాలు పాడితే ప్రేక్షకులు, శ్రోతలు మైమరిచిపోయేవారు. అందుకే ఆయన పేరు వెంకట సుబ్బయ్య కాస్తా ఈల పాట రఘురామయ్యగా మారింది. రఘురామయ్య పేరు వెనుక కూడా ఒక విశేషం ఉంది. ఆయన నాటకాల్లో రఘురాముని పాత్రలు ఎక్కువగా వేయడంతో స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు కాశీనాధుని నాగేశ్వరరావు సుబ్బయ్య పేరును రఘురామయ్యగా మర్చారు. ప్రసిద్ధ కవి రవీంద్రనాధ్ ఠాగూర్ ఆయనకు నాటక కోయిల, ఆంధ్ర నైటింగేల్ ప్రశంసించారు. ఆయన సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు కూడా. నాటకాల్లో రఘురామయ్య కృష్ణుడు, దుశ్యంతుడు, నారదుడు, తదితర పాత్రలను రక్తి కట్టించేవారు. అరవై యేళ్ళ తన వృత్తి జీవితములో అనేక నాటకాల్లో ఇరవైవేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఇరవైరెండు చలనచిత్రాలలో తన అభినయంతో పాత్రలకి జీవం పోసారు. రఘురామయ్య సందర్భానుసారం సుదీర్ఘమైన రాగాలాపనతో మొదలుపెట్టి, శ్రోతలను మంత్రముగ్ధులని చేసే వారు.
రఘురామయ్య గుంటూరు జిల్లా సుద్దపల్లి లో 1901, మార్చి 5 వ తేదీన కళ్యాణం నరసింహరావు, కళ్యాణం వేంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు.
దాదాపు 60 సంవత్సరాలు నాటక రంగంలో ప్రసిద్ధ నటులందరితో రఘురామయ్య స్త్రీ, పురుష పాత్రలు ధరించారు. తిరుపతి వెంకట కవులు రచించిన పాండవోద్యోగ విజయాలలోని పద్యాలను రాగయుక్తంగా పాడుతూ, వాటి భావాన్ని వివరిస్తూ, నటించి ప్రచారం చేశారు. 1933 లో “పృథ్వీ పుత్ర” సినిమా ద్వారా తెలుగు చలనచిత్రంగంలోనికి ప్రవేశించారు. సుమారు 100 చలన చిత్రాలలో నటించారు.
1972లో నాటక బృందంతో కౌలాలంపూర్, బాంకాక్, టోక్యో, ఒసాకా, హాంగ్ కాంగ్, సింగపూర్ లలో పర్యటించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, నెహ్రూ తదితరులు ఈయన వీరి వ్రేలి మురళీ గానాన్ని మెచ్చుకొనగా, రవీంద్రనాథ్ ఠాగూర్ రఘురామయ్యను “ఆంధ్ర నైటింగేల్” అని ప్రశంసించారు. భారత ప్రభుత్వం వీరికి పద్మశ్రీ అవార్డును,. కేంద్ర సంగీత నాటక అకాడమీ విశిష్ట సభ్యత్వాన్ని ఇచ్చి సన్మానించింది. ఈలపాట రఘురామయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన స్వస్థలమైన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో 2014 ఫిబ్రవరి 2 న తెలుగు భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్, వారి సతీమణి ఆవిష్కరించారు. ఈయన తన 75వ ఏట 1975, ఫిబ్రవరి 24 న గుండెపోటుతో మరణించారు.

ఈలపాట రఘురామ్ జయంతి సందర్భంగా…..

Leave a Reply